RandomPosts

free counters
Home » » . రాష్ట్రపతి పాలన విధించం: మొయిలీ

. రాష్ట్రపతి పాలన విధించం: మొయిలీ

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన సాధ్యం కాదని అలా ఆలోచించటం తెలివిమాలిన పని అని కేంద్రం తెలిపింది. ఇది పూర్తిగా అవివేకమని కేంద్ర న్యాయమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమెయిలీ అన్నారు. ప్రత్యేక తెలంగాణా ప్రకటన వెలువడిన తర్వాత రాష్ట్రంలో విస్తృతమైన ఉద్యమాలు చెలరేగటంతో రాజ్యాంగంలోని 356వ అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధిస్తారా అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.

సిఎం కె.రోశయ్యను వైదొలగాలని ఆదేశించారా అని ప్రశ్నించగా అందులో వాస్తవం లేదన్నారు.

రాష్ట్రంలో విభజనపై పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగటంతో రాష్ట్రపతి పాలన విధించాలని వస్తున్న డిమాండ్లపై కేంద్ర న్యాయమంత్రి పైవిధంగా ప్రకటించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని తాము కోరుతున్నామని ప్రతి ఒక్కరినీ విశ్వాసం లోనికి తీసుకోవాలని కోరుతున్నామని ఎవ్వరూ ఆందోళన చెందనక్కరలేదని పరిష్కారం లభిస్తుందని మొయిలీ చెప్పారు.

ప్రత్యేక తెలంగాణా ఏర్పడుతుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. తనవద్ద అందుకు సమాధానం లేదన్నారు.
Share this article :

Recent Posts Slider


Get Your News Widget


 
Support : Your Link | Your Link | Your Link
Copyright © 2013. TELANGANA - All Rights Reserved
Template Created by Creating Website Modified by CaraGampang.Com
Proudly powered by Blogger